ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం ఏపీ భవన్లో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్తో కిరణ్, బొత్స సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ తుది జాబితాను ఖరారు అవకాశం ఉంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అనంతరం జాబితాపై అధికారి ప్రకటన చేయనున్నారు.