ముగిసిన లీ క్వాన్ యూ అంత్యక్రియలు

a7oe8pm8సింగపూర్ : సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ(91) అంత్యక్రియలు ముగిశాయి. యూ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నేతలు హాజరయ్యారు. యూకు పలువురు నివాళులర్పించారు. లక్షలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియా పీఎం టోనీ అబట్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కాంబోడియన్ పీఎం హన్‌సేన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. యూ మార్చి 23వ తేదీన మృతి చెందిన విషయం విదితమే. 1965-1990 మధ్య కాలంలో సింగపూర్ ప్రధానిగా యూ సేవలందించారు.