ముగ్గరు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌,జనవరి3(జ‌నంసాక్షి): జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంలో మరో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. గుల్షన్‌పుర ప్రాంతంలో భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. తప్పించుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు కొనసాగుతుండగా ఓ ఇంట్లో నుంచి టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.