ముగ్గురు విద్యార్థుల గల్లంతు
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్లో సముద్ర స్నానాలకు వెల్లిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైనారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు తమమిత్రులతోకలసి ఉదయం బీచ్లో స్నానాలకు వెళ్లారు. అయితే అలల ఉద్దృతికి కొట్టుకుపోతున్న స్నేహితున్ని రక్షించేందుకు మిగితా ఇద్దరు ప్రయత్నించి నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్చలు మొదలు పెట్టారు.