మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. ముంబయి దాడుల ఘటనలో పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడంతో అతనికి గత ఏడాది ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. భార్య, కూతురు దారుణ హత్య కేసులో నిగప్ప నాటికర్‌ అను దోషి క్షమాభిక్షను తిరస్కరించారు.. పార్లమెంట్‌ దాడి కేసులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా ప్రణబ్‌ తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.