మెట్రో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైలు కిందపడి జహంగీర్‌పూరికి చెందిన ఓ వివాహిత(25) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇవాళ ఉదయం 7:25 గంటలకు చోటు చేసుకుంది. ఆదర్శనగర్ మెట్రో స్టేషన్ వద్ద రైలు వస్తుండగా.. దాని కిందపడి అనిత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అనితకు ధర్మేందర్‌తో 2015లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఒకరి వయసు మూడున్నరేండ్లు కాగా, మరొకరి వయసు ఎనిమిది నెలలు. అనిత మృతదేహాన్ని బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.