మెట్రో రైల్లో ఇకపై 50 శాతం డిస్కౌంట్‌!

చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  ప్రయాణీకులను ఆకట్టుకునేందే చెన్నై కొత్త ప్లాన్‌ వేస్తోంది. సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్‌ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం. చెన్నై మెట్రోలో రోజుకు సగటున లక్షా ఇరవై వేల  మంది ప్రయాణిస్తున్నారు. కానీ  ఆదివారాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య అమాంతం 70 వేలకు పడిపోతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం ఆదివారాలు, సెలవు దినాల్లో టికెట్‌ ధరపై 50 శాతం తగ్గింపును అమలు చేయాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డిస్కౌంట్‌ కొన్ని నెలల పాటు లేదా ఓ సంవత్సరం పాటు కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశకు చేరుకోగా..
త్వరలోనే చెన్నై మెట్రో రైల్‌ బోర్డు ముందుకు చేరనున్నాయి.
/ూగా ఈ ఏడాది మొదట్లో చెన్నై మెట్రో రైలు నెలవారీ పాసులను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పాస్‌ ద్వారా ప్రయాణికులు ఎన్నిసా/-లంల్గ/నా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ పాసులను పొందడానికి ప్రయాణికులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా టూరిస్టు కార్డు కొనేందుకు రూ.50 రీఫండబుల్‌ ఫీజు కట్టాలి. 2017లో మెట్రో యాజమాన్యం ఓ వారం రోజుల పాటు 40 శాతం డిస్కౌంట్‌ అమలు చేయడంతో ప్రయాణికుల సంఖ్య 67 శాతం పెరిగింది. 2017 దీపావళి సందర్భంగా కూడా చెన్నై మెట్రో 20 శాతం డిస్కౌంట్‌ ఇచ్చింది.