మ్యాన్‌¬ల్‌లో పడ్డ బాలిక

తక్షణమే స్పందించి కాపాడిని యువకుడు
వైరల్‌గా మారిన వీడియో
జైపూర్‌,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మ్యాన్‌ ¬ల్‌ లో పడిన ఐదు సంవత్సరాల బాలికను రెప్పపాటులో ఓ యువకుడు రక్షించాడు. ఓ బాలిక ఆడుకుంటూ వెళ్లి రోడ్డుపై మధ్యలో డ్రైనేజీ నాళాలో పడింది. వెంటనే అక్కడే ఉన్న యువకుడు మునిగిపోతున్న బాలికను పైకి లేపాడు. యువకుడు త్వరగా స్పందించకుండా ఉంటే బాలిక చనిపోయేది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మున్సిపల్‌ అధికారుల అలసత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. డ్రైనేజీ మూతను ఓపెన్‌ చేశారు కానీ ఎప్పుడూ మూస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది మొద్దు నిద్ర నుంచి మేల్కొని ప్రజల
ప్రాణాలతో ఆటలాడొద్దని హెచ్చరిస్తున్నారు.