యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ను లాంచ్‌ చేసిన షియోవిూ

న్యూఢిల్లీ,3జనవరి3(జ‌నంసాక్షి): మొబైల్స్‌ రంగంలో దూసుకుపోతున్న  ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు షియోవిూ యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ను విడుదల చేసింది… ఎంఐ ఎయిర్‌పాప్‌ పీఎం 2.5 పేరిట ఓ నూతన యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ను భారత మార్కెట్‌లో గురువారం  విడుదల చేసింది. ఈ మాస్క్‌ 3డీ డిజైన్‌ను కలిగి ఉంది. 4 లేయర్ల ప్రొటెక్షన్‌ను ఇందులో కల్పించారు. కేవలం రూ.249 ధరకే ఈ మాస్క్‌ వినియోగదారులకు లభిస్తున్నది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకనుణంగా దీనిని తయారు చేసారని తెలిపింది.భారత్‌లోని పలు మెట్రో నగరాల్లో ప్రస్తుతం  అధికమవుతున్న గాలి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కాలుష్యం నుంచి రక్షణ కల్పించేందుకు ఈ మాస్క్‌ బాగా పనిచేస్తుందని షియోవిూ వెల్లడించింది. గాలిలో ఉన్న కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలు, కాలుష్య ఉద్గారాలు, పొగ,
కాలుష్య వాయువుల నుంచి ఈ మాస్క్‌ రక్షణ అందిస్తుంది. దీన్ని  వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందిస్తున్నారు.