యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి సజీవ దహనమం

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. 12 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.