యాక్సిస్ బ్యాంక్లో ఘెర అగ్నిప్రమాదం
చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్లో గురువారం ఘెర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు భవనంలోని మూడో అంతస్తులు మంటలు చెలరేగినట్లు సమాచారం. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
చాలా ఇరుగ్గా వున్న భవనంలో ఒకే మార్గం వుండటం వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా వుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడంతస్తుల భవనంలో ఏకంగా 18 బ్యాంక్లు వున్నాయని, మంటలకు భయపడి పైనుంచి కిందికి దూకిన ఇద్దరు మహిళలు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.