యూత్కు మినహాయింపులేదు

డబ్ల్యూహెవో హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 21(జనంసాక్షి): నోవెల్ కరోనా వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే అయినా యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నరేంద్ర హెచ్చరికలు చేసింది. దీనిపట్ల తమకేమీ కాదన్ననిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించింది. వైరస్ వల్ల టీనేజీ పిలుపునిచ్చారుయువత కూడా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్డీస్ అదనమ్ జరిగిన గేట్రియాసిస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు రెండున్నర లక్షలకు చేరుకున్నది. మరణాల జట్టు సంఖ్య పది వేలు దాటింది. అయితే వైరస్ ఛాయలు ప్రతి రోజూ ఓ కొత్త మైలురాయిని చేరుకుంటున్నట్లు టెడ్డీస్ తెలిపారు. యువత వల్లే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు కూడా డబ్ల్యూహెవో అభిప్రాయపడింది. ఎక్కువ శాతం మంది వృద్ధులే మరణిస్తున్నా.. వైరస్ మాత్రం యువత వల్ల వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. అందుకే అన్ని దేశాలు దాదాపు భారీ సమూహాలను నిలువరిస్తున్నాయి. మాకేం కాదన్న ధోరణితో యువత ఉంటోందని, కానీ వారి వల్లే ఆ వైరస్ వాళ్ల వాళ్ల ఇండ్లల్లోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాంతోనే బామ్మలు, తాతయ్యలు, తల్లితండ్రులకు సోకుతున్నట్లు ఓ అంచనాకు వచ్చారు. యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. వారు మాత్రం హోస్టుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లో మరణాల సంఖ్య ఒక్క శాతం కన్నా తక్కువే పోరాడిన ఉన్నా.. వారు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.