యూపిలో నేడు ఐదో విడత పోలింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి
61 అసెంబ్లీ స్థానాల్లో 692మంది పోటీ
ప్రముఖుల్లో డిప్యూటి సిఎం కేశవప్రసాద్‌ మౌర్య
లక్నో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఐదో విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఆదివారమే ఓటింగ్‌ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ శుక్రవారం ప్రచారం ముగిసింది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. న్నికలు జరగనున్న జిల్లాల్లో సుల్తాన్‌పుర్‌, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, బహ్రయిచ్‌, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఈ దశలో పోలింగ్‌ జరగనుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఆదివారమే ఓటింగ్‌ జరునుంది. ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్‌ నేత పల్లవి పటేల్‌ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్దార్థ నాథ్‌ సింగ్‌ అలహాబాద్‌ పశ్చిమం, రాజేంద్ర సింగ్‌(ప్రతాప్‌?గఢ్‌?), నంద గోపాల్‌ గుప్తా నాడి (అలహాబాద్‌ దక్షిణం), రమాపతి శాస్త్రి (మంకాపుర్‌), 1993 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న రఘురాజ్‌ ప్రతాప్‌? సింగ్‌ మరోమారు కుండా నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత ఆరాధన మిశ్రా పోటీలో ఉన్నా 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా ఆదివారం జరగనున్న పోలింగ్‌తో మొత్తం 292 స్థానాలకు ఓటింగ్‌ పూర్తి కానుంది. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.