రాంసింగ్‌ది ఆత్మహత్యే

శవ పరీక్ష అనంతరం తేల్చిన వైద్యులు
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్‌ మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శవపరీక్ష నిర్వహించారు. రాంసింగ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తీహార్‌ జైల్లో నిన్న ఉదయం రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.