రాజకీయ లబ్ది కోసమే తెదేపాపై విమర్శులు : ఎర్రబెల్లి
హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ తెదేపాను టార్గెట్ చేశారంటూ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కన బెట్టి కేసీఆర్ రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెరాస రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు తెదేపాతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాను విమర్శించకుండా తెదేపాపై విమర్శలు చేస్తే తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జేఏసీ తరపున వీరుల వారసులను ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు.