రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
జైపూర్: రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీకి కానుక ఇస్తాం. ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ఆయనకు కానుకగా ఇస్తాం. రాజస్థాన్లో పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడైన తర్వాత సీఎం ఎవరో రాహుల్ చెప్తారు. ఈ సారి అద్భుతం జరగబోతోంది.’ అని తెలిపారు.