రాజ్యసభ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనపై రాజసభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేశారు.