రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి ఇచ్చే మర్యాద ఇదేనా ?

పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ప్రతిస్పందనలు
పట్టాభి వాడిన భాషపై ఆరా తీస్తున్నాం
మాదకద్రవ్యాలకు ఎపికి సంబంధం లేదు: డిజిపి
విజయవాడ,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : టీడీపీ నేత పట్టాభి మాట్లాడిరది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. బుధవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. మంగళవారం సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్‌లో ఒక కాల్‌ వచ్చింది. కాల్‌ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు.నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు
డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్‌ కూడా విజయవాడకు రాలేదన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఎª`లాగ్‌ డే నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని డీజీపీ అన్నారు.