రాష్ట్రప్రభుత్వానికి ఎస్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదశ్‌ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టిన ఉపాధ్యాయులపై మీడియా కథనాలకు స్పందించిన కమిషన్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పుస్తకాల నిర్వహణ సరిగా లేదని కాకినాడలో తొమ్మిదేళ్ల బాలుడి చెయ్యి విరగొట్టిన ఘటనపై, మధ్యప్రదేశ్‌లో పదేళ్ల విద్యార్థిని మెడ, వీపు భాగాల్లో తీవ్రంగా గాయపర్చిన ఘటనపై హక్కుల సంఘం స్పందించింది.