రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల పొత్తులు తదితర అంశాలతో రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పి నేతలతో రాహుల్‌ చర్చిస్తున్నారు. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.