రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ చుట్టూ నాలుగు ప్రధాన ద్వారాలుండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా మూసేసి గ్రిల్స్‌ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దాని పక్కనే కొత్త ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం ముందు వాహనాలు రాకపోకలు సాగించడానికి కొత్త తారు రోడ్డును సిద్ధం చేస్తున్నారు.