రాహుల్‌తో ముగిసిన కాంగ్రెస్‌ నేతల సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశం అనంతరం బోత్స విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణతో పాటు అన్ని అంశాలను రాహుల్‌ గాంధీతో చర్చించినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని సమగ్రంగా రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.