రాహుల్, సోనియా చిత్ర పటాలకు పూజలు
దిల్లీ: దేశమంతా రాజకీయ వాతావరణంలో మునిగి తేలుతోంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో గెలుపు గుర్రాలెవరో తెలుసుకోవడానికి యావత్ భారత్దేశం ఎదురుచూస్తోంది. ఎన్నికల పోలింగ్ ముందు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయడం చూసే ఉంటాం. ఇప్పుడు ఎన్నికల లెక్కింపు రోజు కూడా ఇలాంటి ఘట్టమే నెలకొంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, రాజస్థాన్ కాంగ్రెస్ ఛీఫ్ సచిన్పైలెట్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్చిత్ర పటాలకు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పూజలు నిర్వహించారు.