రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

న్యూఢిల్లీ  :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రుణాల మాఫీపై కాగ్‌ నుంచి సమగ్ర నివేదిక కోరుతామని పవార్‌ వెల్లడించారు.