రూ. 417 కోట్ల నీలం తుపాను పరిహార నిధులు విడుదల

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీలం తుపాను పరిహారం కింద కేంద్రం రూ.417 కోట్లను విడుదల చేసింది. తుపాను నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రకు కరువు నిధుల కింద రూ. 1,207 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.