రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి దిశగా భారత్‌

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి దశగా భారత్‌ పయణిస్తోంది. 122 పరుగుల వద్ద వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. యువజరాజ్‌సింగ్‌ 11 పరుగులు చేసి అండర్‌సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధోని అండర్‌సన్‌ బౌలింగ్‌లోనే కుక్‌కు క్యాచి ఇచ్చిపరుగులేమి చేయకుండా ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్‌ 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకు  ఆలౌట్‌ అయింది.