రెండో రోజుకు చేరున్న ప్రధాని మోడీ చైనా పర్యటన…

చైనా: ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య 24 ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. రేపు చైనా సంస్థల సీఈవోలతో మోడీ సమావేశం కానున్నారు. రేపు షాంఘైలో భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.