రేపటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి వెంట రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్‌ రంజన్‌ చౌదురి, పలువురు సీనియర్‌ అధికారులు బంగ్లాదేశ్‌కు వెళ్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జిల్లూర్‌ రహ్మాన్‌, ప్రధాని షేక్‌ హసీనా, వినక్షనేత ఖలేదా జియా తదితర నేతలతో రాష్ట్రపతి భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు.