రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

బళ్లారి, నవంబర్‌ 22 :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా హలకుంది సవిూపంలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బళ్లారి జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలైలోని అయ్యప్ప స్వామిని దర్శించునేందుకు జీపులో బయల్దేరారు. స్వామి వారి దర్శనం చేసుకొని తిరిగివస్తుండగా.. గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బళ్లారి సవిూపంలో హలకుంది వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బళ్లారి జిల్లా వాసులే. ఉదయం పొగమంచు ఆవరించి ఉండడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కనిపించక పోవడంతోనే.. ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.