లిమా రోడ్డు ప్రమాదంలో 8మంది దుర్మరణం

లిమా,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పెరూ రాజధాని లిమా సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పియురా నుంచి లిమాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు పైభాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. అమెరికన్‌ పాపులర్‌ రివెల్యూషనరీ అలియన్స్‌(ఏపీఆర్‌ఏ) పార్టీకి చెందిన బృందం బస్సులో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.