లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రాంరంభం కాగానే బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.