లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు ఆందోనకు దిగారు

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గు కుంభకోణం, చిన్నారిపై అత్యాచారం, తృణమూల్‌ నేతలపై ఢిల్లీలో జరిగిన దాడి ఘటన తదితర అంశాలపై విపక్ష, సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఓసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే వివిధ పార్టీల సభ్యులు ఆందోళనకు దిగి సభలో నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.