లోక్‌సభలో హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై షిండే ప్రకటన

న్యూఢిల్లీ : రెండుసార్లు వాయిదా అనంతరర లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి షిండే లోక్‌సభలో ప్రకటించారు. నిన్న సాయంత్రం 6.58, 7.01 గంటలకు రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ఘటనలో 16 మంది మృతి చెందారు. 115 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైకిల్‌కు బాంబులు అమర్చి పేల్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలిని పోలీస్‌, ఎన్‌ఐఏ బృందాలు చేరుకుని సాక్ష్యాలు సేకరించాయి. ఈ ఘటనకు సంబంధించి సరూర్‌నగర్‌, మలక్‌పేట పీఎన్‌లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన ప్రకటించారు.