లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
ఢిల్లీ: విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభ మూడోసారి వాయిదా పడింది. ఎఫ్డీఐలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ మీరాకుమార్ మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఎఫ్డీఐలపై ఓటింగ్తో కూడిన చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు ఎఫ్డీఐలపై తృణముల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ తీర్మానానికి ముగ్గురు బీజేడీ సభ్యులు సమర్థించారు.