లోక్సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అత్యాచారాలు, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీపై ఢిల్లీలో జరగిన దాడిపై సభను విపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. అంతకు ముందు కూడా ప్రతిపక్షాల ఆందోళనల మధ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ మధ్యాహ్నం తిరిగి సమావేశమైన సభలో గందగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభును రేపటికి వాయిదా వేశారు.