లోయలో పడ్డ పర్యాటక బస్సు

26మందికి గాయాలు

సిమ్లా,జనవరి22(జ‌నంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మనాలి నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఓ పర్యాటకుల బస్సు బిలాస్‌పూర్‌ జిల్లా స్వరఘాట్‌ ప్రాంతంలో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు గాయపడ్డారు.

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 18 మందిని చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడగా వారిని చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వర్షాలు, విపరీతమైన మంచు కారణంగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.