వర్ష బీభత్సంపై సిఎం జగన్‌ సవిూక్ష

వర్ష బాధిత ప్రాంతాల్లో తక్షణసహాయ చర్యలు

మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

వర్షబాధితులకు తక్షణ సాయంగా 2వేల సాయం

పంటనష్టాన్ని కూడా అంచనా వేయాలి

వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సవిూక్ష

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ) :  భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సవిూక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్‌, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించామని తెలిపింది.  వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సిఎం జగన్‌కు తెలిపారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయిప్రస్తుతం ఇది తమిళనాడులో తీరందాటింది.దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందిచెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోంది.ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం అని వవరించారు. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చామన్నారు.అనంతరం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్‌ జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకున్నారు.  చిత్తూరు జిల్లాలో పరిస్థితులను కలెక్టర్‌ హరినారాయణ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్నలు వివరించారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్నారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అలాగే వారికి మంచి భోజనం, తాగునీరు అందించాలని, వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం  ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారిని కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశించారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని, టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలి అధికారులను సీఎం ఆదేశించారు. తిరుపతి నగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సీఎం అన్నారు. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలన్నారు. కడప జిల్లాలో పరిస్థితులను  కలెక్టర్‌ విజయరామరాజు వివరించగా గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా… నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సిఎం జగన్‌ ఆదేశించారు. రదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలన్నారు. నెల్లూరుజిల్లాలో పరిస్థితులను వివరించిన కలెక్టర్‌ చక్రధర్‌ సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందన్నారు. సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం ఆదేశిచారు. అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని కలెక్టర్‌ నాగలక్ష్మి వివరించారు. వర్ష బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై  ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలు వివరించారు. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి… తాగునీటి నాణ్యతను తెలుసు కోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశిచారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశిచారు. సచివాలయం నుంచి  హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖమంత్రి పి అనిల్‌ కుమార్‌, సీఎస్‌ డాక్టర్‌ సవిూర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌,  డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు సవిూక్షలో పాల్గొన్నారు.