వాయిదా పడిన పార్లమెంట్ ఉభయసభ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.