వారాంతపు సంతలో చేతి గుర్తు  ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులతో వినూత్న ప్రచారం

తిరుమలాయపాలెం. జనంసాక్షి .మే 11.

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ. శనివారం మండల పరిధిలోని పిండిప్రోలు లో రామ సహాయం మాధవి రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు. నీరుడు లాజరస్ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో తయారు చేయించిన రెండువేల ప్లాస్టిక్ చేతి సంచులను వారాంతపు సంతలో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు అయిన బ్యాలెట్ పేపర్ లో మూడవ నెంబర్ చేతి గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని, కూరగాయలు కొనుగోలు కోసం సంతకు వచ్చిన ప్రజలకు చేతి సంచులు పంపిణీ చేసి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నీరుడు లాజరస్ , కాంగ్రెస్ నాయకులు షేక్ నిజాం, చామకూరి శ్రీనివాస్, రామనబోయిన వెంకటేశ్వర్లు, పూజ కిషోర్, గోపోజి రఘు, మెట్టు రవి, దామల్ల సామేలు, ధరావత్ వీరన్న, ధరావత్ నాణ్య, గుగులోత్ తావూరియా, తదితరులు పాల్గొన్నారు..