వాసవీ మాతకు బంగారుచీర బహుకరణ

ఏలూరు,అక్టోబర్‌8 (జనంసాక్షి) : భీమవరంలో ఆర్యవైశ్య సంఘం భవనంలోని వాసవీ మాతకు బంగారు చీరను అలంకరించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా.. అలాగే ఆర్యవైశ్య సంఘం 60 వసంతాలు పూర్తి చేసుకోవడాన్ని పురష్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి బంగారు చీరను కానుకగా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు చేతులవిూదుగా మాతకు బంగారు చీరను బహూకరించారు. ముందుగా ఊరేగింపు నిర్వహించారు. తర్వాత అమ్మవారికి చీరను అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆర్య వైశ్య సంఘం, ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కోటి రూపాయలు విలువ చేసే.. సుమారు రెండు కేజీల బంగారంతో ఈ చీరను తయారు చేయించారు.