విద్య,వైద్యానికి జగన్‌ ప్రాధాన్యంమెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆళ్లనాని

గుంటూరు,నవంబర్‌29(( జనంసాక్షి) ):  విద్య, వైద్యంకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం నాడు గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా పైలాన్‌ను మంత్రులు సుచరిత, ఆళ్ళ నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ పురాతన కళాశాల అని చెప్పారు. మధురైకి వెళ్ళాల్సిన కాలేజ్‌ను ఇక్కడ ఏర్పాటు చేశామని.. ఎంతోమంది ఇక్కడ చదువుకొని ప్రముఖ వైదులయ్యారని మంత్రి తెలిపారు. ’రూ. 500 కోట్లతో కాలేజ్‌ను, ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నో స్పెషాలిటీ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. ఒమిక్రాన్‌ కట్టడి కోసం మద్యాహ్నం సీఎం సవిూక్షా సమావేశం ఉంది. సీఎం సూచనల మేరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏ వేరియంట్‌ వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉన్నాం. జిజిహెచ్‌లో మాతా శిశు సంరక్షణ భవనం పనులు మొదలు పెట్టే విధంగా అధికారులతో మాట్లాడతాను. ఆరోగ్య శ్రీ బిల్స్‌ గతంలో ఆరేడు నెలలు పెండిరగ్‌లో ఉండేవి. 21 రోజుల్లో బిల్స్‌ క్లియర్‌ చేయాలని సీఎం చెప్పారు. అదేవిధంగా బిల్స్‌ చెల్లిస్తాం’ అని నాని చెప్పుకొచ్చారు.