విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..

ప్రభుత్వ ఉచిత దుస్తులు పంపిణీ ….

ఎంఈఓ విజయ్ కుమార్.
ఫోటో రైటర్ దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంఈఓ…
 వరంగల్ బ్యూరో :సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
 బావి భారత పౌరులైన విద్యార్థులు ఉపాధ్యాయుల అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంఈఓఎన్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం శవరంగల్ లోని ప్రభుత్వ సహాయక వాణి ప్రాథమిక పాఠశాలను  వరంగల్ ఎంఈఓ ఎన్ విజయకుమార్ పాఠశాల రికార్డులను పరిశీలించారు.  పాఠశాల సందర్శించి న  ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే విషయాలను అర్థం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. విద్యార్థులకు ఈ సందర్భంగా  యూనిఫారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల
 ప్రధానోపాధ్యాయురాలు  ఇందిర, ఉపాధ్యాయులు మనోజ్ ,సుజాత పాల్గొన్నారు.
Attachments area