విద్యార్థులు గుజరాత్ సీఎం పాఠాలు
న్యూఢిల్లీ : ఢీల్లీలోని ఒక కళాశాలలో విద్యార్థులకు అభివృద్థి పాఠాలు చెప్పడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఢీల్లీ చేరుకున్నారు. ఉదయం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో తన విజయానికి ప్రధాని అభినందనలు తెలిపారని మోడీ తెలియజేశారు. మధ్యాహ్నం మోడీ ఢిల్లీలోని ఎన్ఆర్సీసీ కళాశాలలో ‘ బిజినెన్ కాంక్లేవ్ – 2013’ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. సుపరిపాలన, అభివృద్ధి తదితర అంశాలపై విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానాలివ్వనున్నారు.