విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కు గుండెపోటు

సింగరాయకొండ గ్రామీణం, జరుగుమల్లి(ప్రకాశం): విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండె పోటుతో మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని బీకే త్రెషింగ్‌ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సును నడుపుతున్న పాశం వెంగయ్య(30) కు ఆకస్మికంగా గుండె పోటు వచ్చింది. ఆ బాధతోనే బాధతోనే బస్సును అదుపు చేసేందుకు వెంగయ్య తీవ్రంగా యత్నించాడు. వెంటనే స్పందించిన కండక్టరు మహబూబ్‌ బాషా, బస్సులో ప్రయాణిస్తున్న మరో డ్రైవర్‌ బ్రేకుపై కాలు మోపి బస్సును పూర్తిగా నియంత్రించారు.దీంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా బయట పడ్డారు. గుండెపోటుతో బాధపడుతున్న వెంకయ్యకు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు ప్రథమ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది.