వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే వ్యాపార దినదిన అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గోల్డ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూంను ప్రారంభించిన మంత్రి
 ఎల్బీనగర్( జనం సాక్షి ) వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారమైన దినదిన అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.  మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్  బాలాపూర్ చౌరస్తాలో ”గోల్డ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూంను  మంత్రి వర్యులు . సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్  గౌరవ మేయర్,డిప్యూటీ మేయర్,ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు,మీర్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. అర్కల కామేష్ రెడ్డి , జల్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ యూసఫ్ పటేల్ , మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్.  సాంబశివ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.