విఫలమైన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. 29 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. 6 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. అక్షిత్‌ రెడ్డి 2, శిఖర్‌ ధావన్‌ 0, సంగక్కర 4, శర్మ 6, పెరీరా 4 పరుగులు చేశారు. డారెన్‌ సామి (8),అమిత్‌ మిశ్రా (0) క్రీజులో ఉన్నారు. రాజస్థాన్‌ బౌలర్లు ఫాల్కనర్‌ మూడు, చండిలా రెండు,కూపర్‌ ఒక వికెట్‌ తీశారు.