విమానంలో మంటలు…15మందికి గాయాలు

w5cj67ykమియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో  రన్వేపై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

గురువారం బోయింగ్ 767 విమానం వెనిజులాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో 101 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వేపై విమానంలోని ఓ ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై విచారించేందుకు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఓ బృందాన్ని పంపింది.