వీలుంటే చంపేయండి..

– ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం గుస్సా…

దిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి): దేశ రాజధానిలో కాలుష్య నివారణకు కేంద్రం, రాష్ట్రాలు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇలా ప్రజలను బలవంతంగా గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచడం కంటే.. పేలుడు పదార్థాలు తెచ్చి ఒకేసారి అందర్నీ చంపేయడం నయమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి తెలిపింది. ‘ప్రజలను విూరెలా చూస్తున్నారు? వారు చనిపోవాలని అనుకుంటున్నారా? పంట వ్యర్థాల దహనంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత పంట వ్యర్థాల దహనం మరింత పెరిగింది. ఇది విూ వైఫల్యం కాదా? విూ వల్ల దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రజలు కాలుష్యంలో మగ్గుతున్నారు. పంట వ్యర్థాలపై విూరెలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే ప్రజలు చనిపోయినా ఫర్వాలేదనే కదా విూ ఉద్దేశం’ అని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను న్యాయస్థానం ఎండగట్టింది. ‘దిల్లీ కాలుష్యానికి విూరంటే విూరు కారణమంటూ నిందలు వేయడం చూస్తుంటేగ్భ్భ్రాంతికరంగా ఉంది. విూ వల్ల ఎందుకు ప్రజలు ఇలా ఇబ్బంది పడాలి? వారిని బలవంతంగా ఎందుకు గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచాలనుకుంటున్నారు? అంతకంటే ఓ 15 బ్యాగుల పేలుడు పదార్థాలు తెచ్చి అందర్నీ ఒకేసారి చంపెయ్యండి’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీ ప్రస్తుతం నరకం కంటే దారుణంగా ఉందని, ఇతర దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయని ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తి జీవితానికి విూరిచ్చే విలువ ఇదేనా..? విూకు కుర్చీలో కూర్చునే అర్హత లేదు’ అని దిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. ఈ సందర్భంగా దిల్లీ చీఫ్‌ సెక్రటరీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల కారణంగా పాలనపరమైన సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు తమ విభేదాలను పక్కనబెట్టి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. దిల్లీలో గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా ప్రణాళిక రచించాలని స్పష్టం చేసింది.