వృద్ధిరేటు పెరుగుతుంది: ప్రణబ్‌

భువనేశ్వర్‌: వచ్చే రెండు మూడేళ్లలో దేశం మళ్లీ 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశ వార్షిక ఆర్థిక రేటు 7.9గా నమోదయిందని తెలిపారు. 2012-13లో 5.0 శాతనికి పడిపోయిందని వెల్లడించారు. మెరుగైన వృద్ధిరేటు సాధించేందుకు ప్రభుత్వం అవలంభిస్తున్న విదానాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఉత్కళ యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.