వెంకటపురం విలేజ్ కి ఆర్టీసీ బస్సులు నడిపించాలి కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ వెంకటాపురం విలేజ్ లోకి ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలని ప్రజల కోరిక మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు హకీంపేట్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ వివిధ పనులకు ఉద్యోగాలకు వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడుతుందని వెంటనే ఆర్టీసీ బస్సులను పునర్దరించాలని డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేయడంతో పాటు డిపో మేనేజర్ వెంటనే సానుకూలంగా స్పందించారు.